15.8 C
London
Friday, April 18, 2025
Homeజాతీయందేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది

దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది

Date:

సంతాపం వ్యక్తం చేసిన టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ మరణం పట్ల టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ఆర్థిక పితామహుడిని,క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. ’’దేశ వ్యాప్తంగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు, విప్లవాత్మకమైన పథకాలు తీసుకు వచ్చిన నేత మన్మోహన్ సింగ్. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన ఆర్థిక మేధావి. కేంద్ర ఆర్థిక మంత్రిగా…ప్రధానిగా ఆయన చేసిన సేవలు ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే సుస్థిర ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత ఆయనది. ఆయన జీవితం అందరికీ ఆదర్శం. మన్మోహన్​ సింగ్​ మరణం మన దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా‘‘నని జగ్గారెడ్డి ఈ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

Latest stories