16.8 C
London
Friday, April 18, 2025
Homeసంగారెడ్డిసీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

Date:

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి

రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ ఛైర్మన్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేయనున్నామన్నారు. సంగారెడ్డి ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి, సదాశివపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్లు రామచంద్ర నాయక్, గడీల రాంరెడ్డి, సీనియర్ నాయకులు కూన సంతోష్, కిరణ్, రైతు సంఘం నాయకుడు తుమ్మలపల్లి ప్రిథ్వీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

Latest stories