11.8 C
London
Thursday, May 8, 2025
Homeసంగారెడ్డికేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

Date:

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం

సంగారెడ్డిలో నిరసన చేపట్టిన టీజీఐఐసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయమే చేశారని టీజీఐఐసీ ఛైర్​ పర్సన్​, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది భీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించారని, ఇద్దరు కేంద్రమంత్రులు అయ్యారన్నారు. ఇంత మంది ఉన్నా సొంత రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయారన్నారు. ప్రజలు ఇలాంటి వారిని గెలిపించి ఏం ప్రయోజనమన్నారు. సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… తమకు ఈసారి బడ్జెట్లో నిధులు కావాలని సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలుమార్లు కేంద్రాన్ని విన్నవించారన్నారు. అయినా బడ్జెట్​ ప్రస్తావనలో కనీసం తెలంగాణ పేరు లేకుండా చేశారన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేలా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, సీడీసీ ఛైర్మన్​ గడీల రాంరెడ్డి, సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ రాంచందర్​ నాయక్​, సీనియర్​ నేతలు కూన సంతు, కిరణ్​, బొంగుల రవి తదితరులు పాల్గొన్నారు.

Related stories

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

సీఎం రేవంత్ నిర్ణయం.. రైతుల్లో సంతోషం

సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి...

Latest stories