తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC Elections) నియోజకవర్గ స్థానాలకు ఎన్నికల షెడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ విడుదల: 3 ఫిబ్రవరి 2025
నామినేషన్లకు చివరి గడువు: 10 ఫిబ్రవరి 2025
నామినేషన్ల పరిశీలన: 11 ఫిబ్రవరి 2025
నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు: 13 ఫిబ్రవరి 2025
పోలింగ్: 27 ఫిబ్రవరి 2025
పోలింగ్ జరిగే సమయం: ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు
కౌంటింగ్: 3 మార్చి 2025