Sangareddy: సంగారెడ్డి యువతకు శుభవార్త.. 30న జాబ్ మేళ.. వివరాలివే
సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ (ITI) లో ఈ నెల 30వ తేదీన భారీ అప్రెంటిషిప్ జాబ్మేళా నిర్వహించనున్నారు

సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ (ITI) లో ఈ నెల 30వ తేదీన భారీ అప్రెంటిషిప్ జాబ్మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈ మేళా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి ఈ జాబ్మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
నిర్వహణ తేదీ: జనవరి 30, 2026.
వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, సంగారెడ్డి.
పాల్గొనే సంస్థ: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్.
మొత్తం ఖాళీలు: 280కి పైగా అప్రెంటిషిప్ పోస్టులు.
అర్హతలు: ఐటీఐ (ITI), డిప్లొమా (Diploma), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేదా సంబంధిత టెక్నికల్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో నేరుగా మేళాకు హాజరుకావాలి. అప్రెంటిషిప్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా, ప్రముఖ సంస్థలో పని అనుభవం పొందేందుకు ఇది ఒక చక్కని వేదిక.



