తెలంగాణసంగారెడ్డి
GMR: పటాన్ చెరు ఎమ్మెల్యేను కలిసిన ఇంద్రేశం నూతన మున్సిపల్ కమిషనర్
పటాన్ చెరువు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన వేళ, పాలనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్గా అజయ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు

సంగారెడ్డి: పటాన్ చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైన వేళ, పాలనలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ కమిషనర్గా అజయ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గురువారం ఆయన పటాన్ చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ భేటీ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నూతన కమిషనర్కు అభినందనలు తెలియజేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.



