తెలంగాణసంగారెడ్డి

జిన్నారం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు

పటాన్‌చెరు: జిన్నారం మున్సిపాలిటీలోని అన్ని వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పూర్తి సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిన్నారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం మొదటి పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

అభివృద్ధికి నిధులు సిద్ధం..
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో మండల పరిషత్‌గా ఉన్న జిన్నారం ప్రస్తుతం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిందని, దానికి తగినట్లుగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఒక్కో మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ఈ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని ఆయన ప్రకటించారు.

ప్రజాప్రతినిధులకు సూచనలు..
రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, గెలిచిన తర్వాత ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఎన్నికైన ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జిన్నారంను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతితో పాటు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *