తెలంగాణసంగారెడ్డి

Republic Day: ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గుమ్మడిదల మహిళకు ఆహ్వానం.. కర్తవ్య పథ్‌లో ప్రత్యేక అతిథిగా మౌనిక!

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడం ఎవరికైనా ఒక కల. అటువంటి అరుదైన అవకాశం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ఒక మహిళా పారిశ్రామికవేత్తను వరించింది.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించడం ఎవరికైనా ఒక కల. అటువంటి అరుదైన అవకాశం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ఒక మహిళా పారిశ్రామికవేత్తను వరించింది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే పరేడ్‌ను ప్రత్యక్షంగా చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆమెను సాదరంగా ఆహ్వానించింది.

అరుదైన గుర్తింపు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) పరిధిలోని కాయిర్ బోర్డు ద్వారా ఈ ఆహ్వానం అందింది. మహిళా కాయిర్ యోజన (Mahila Coir Yojana) కింద ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్‌కు ఈ గౌరవం దక్కింది. తన వృత్తిలో ఆమె చూపిన ప్రతిభ, అంకితభావానికి గానూ కేంద్రం ఆమెను, ఆమె జీవిత భాగస్వామిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది.

తెలంగాణ నుండి ఐదుగురికే అవకాశం
ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం మొత్తం మీద కేవలం ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలను మాత్రమే ఈ వేడుకలకు ఎంపిక చేశారని, అందులో తాను ఒకరిగా ఉండటం చాలా గర్వంగా ఉందని తెలిపారు. దేశ రాజధానిలో జరిగే చారిత్రాత్మక పరేడ్‌ను అధికారిక అతిథిగా వీక్షించే అవకాశం రావడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం కేవలం ఆమెకే కాకుండా, గుమ్మడిదల ప్రాంతానికే గుర్తింపు తెచ్చిపెట్టింది. స్వయం ఉపాధి, పరిశ్రమల రంగంలో రాణిస్తున్న మహిళలకు ఈ గుర్తింపు గొప్ప స్ఫూర్తినిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *