తెలంగాణ

నంద్ ఘర్‌లను ప్రారంభించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…

భారత ప్రభుత్వ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్ లో నంద్ ఘర్ కేంద్రాలను ప్రారంభించి కీలకమైన ముఖ్యమైన అడుగు వేశారు

హైదరాబాద్: భారత ప్రభుత్వ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్ లో నంద్ ఘర్ కేంద్రాలను ప్రారంభించి కీలకమైన ముఖ్యమైన అడుగు వేశారు. హైదరాబాద్ జిల్లాలోని 36 కేంద్రాలతో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రజల చెంతకు చేరింది. వేదాంత సంస్థ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక సామాజిక కార్యక్రమం దేశంలోని అంగన్‌వాడీ వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకువస్తోంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ కేంద్రాల ద్వారా పోషకాహారం, చిన్నపిల్లల సంరక్షణ విద్య, ప్రాథమిక వైద్యం మహిళా సాధికారత వంటి అన్ని రకాల సేవలను ఒకే చోట అందిస్తున్నారు.

ఈ విస్తరణతో నంద్ ఘర్ దక్షిణ భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇప్పుడు తెలంగాణలో కూడా అడుగుపెట్టడం ద్వారా ఈ ప్రాంతంలో సమగ్ర సామాజిక అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుంది. తెలంగాణలోని అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుంది. సమాజంలో పెద్ద ఎత్తున సానుకూల మార్పులను తీసుకురావాలనే వేదాంత సంస్థ లక్ష్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

ఈ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వేదాంత సంస్థ చేపట్టిన నంద్ ఘర్ వంటి కార్యక్రమాలు దేశానికి బలమైన పునాదిని నిర్మిస్తాయని కొనియాడారు. అట్టడుగు స్థాయిలో పిల్లల సంక్షేమం మహిళా సాధికారతపై దృష్టి పెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా చేసే ప్రయత్నాలు సమాజంలో అర్థవంతమైన, శాశ్వతమైన మార్పులను ఎలా తీసుకువస్తాయో ఇక్కడ జరుగుతున్న పనే నిదర్శనమని ఆయన వివరించారు.

ఈ నంద్ ఘర్ కేంద్రాల ద్వారా హైదరాబాద్ జిల్లాలో దాదాపు 3,000 మంది చిన్నారులు మహిళలకు లబ్ధి చేకూరనుంది. నాణ్యమైన పోషకాహారం, విద్య, వైద్యం ఉపాధి అవకాశాలను ఈ కార్యక్రమం చేరువ చేస్తోంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అక్కడ ఉన్న పిల్లలు, తల్లులు అంగన్వాడీ సేవికలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ఈ పథకం ద్వారా జరుగుతున్న మార్పులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లతో పాటు పోషకాలతో కూడిన మిల్లెట్ బార్లను పంపిణీ చేశారు. అనుబంధ పోషకాహార సేవల ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు నంద్ ఘర్ కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నంద్ ఘర్ సీఈఓ శశి అరోరా మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి స్వయంగా ఈ కేంద్రాలను ప్రారంభించి ఇక్కడ జరుగుతున్న మార్పులను పరిశీలించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. తమ చైర్మన్ ఆలోచనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన అభివృద్ధిని తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ప్రతి బిడ్డకు జీవితంలో సరైన ప్రారంభం దక్కాలని ప్రతి మహిళకు ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించేలా ఒక మంచి వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. అందరి సహకారం భాగస్వామ్యంతో ఈ నంద్ ఘర్ నమూనాను మరింత విస్తరించి సమాజంలో ఇంకా గొప్ప మార్పులను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేల 300కు పైగా కేంద్రాలతో విస్తరించిన నంద్ ఘర్ సాధించిన ఈ మైలురాయి సామూహిక కృషికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రభుత్వ మద్దతు, ప్రజల భాగస్వామ్యం సంస్థాగత నిబద్ధత కలిస్తే ఎంతటి అర్థవంతమైన మార్పు సాధ్యమో ఇది నిరూపిస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న 14 లక్షల అంగన్‌వాడీలపై ప్రభావం చూపాలని 8 కోట్ల మంది పిల్లలు, 2 కోట్ల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. స్థిరమైన అభివృద్ధి భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన నంద్ ఘర్ ప్రతి బిడ్డకు ఎదిగే అవకాశం, ప్రతి మహిళకు నాయకత్వం వహించే శక్తిని అందించేలా పటిష్టమైన సమాజాన్ని నిర్మించే దిశగా తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *