గోద్రెజ్ ఆగ్రోవెట్ క్రీమ్లైన్ డైరీ సీఈఓగా గౌరవ్ పాండే నియామకం…
భారత్లోని ప్రముఖ వైవిధ్యభరితమైన అగ్రి-బిజినెస్ కంపెనీలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రెజ్ ఆగ్రోవెట్), క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గౌరవ్ పాండేని నియమిస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది

హైదరాబాద్,: భారత్లోని ప్రముఖ వైవిధ్యభరితమైన అగ్రి-బిజినెస్ కంపెనీలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రెజ్ ఆగ్రోవెట్), క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గౌరవ్ పాండేని నియమిస్తున్నట్టు ఇవాళ ప్రకటించింది. మార్కెట్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం, వ్యాపార మార్పులను వేగవంతం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు కీలక మార్కెట్లలో బ్రాండ్ ఉనికిని విస్తరించడంపై దృష్టి సారిస్తూ ఆయన కంపెనీ తదుపరి వృద్ధి దశను నడిపిస్తారు.
క్రీమ్లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తన నియామకంపై గౌరవ్ పాండే మాట్లాడుతూ, “భారతీయ పాడి పరిశ్రమలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయని, విలువ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, నాణ్యత మరియు పోషకాహారంపై శ్రద్ధ పెరుగుతోందని ఇలాంటి కీలక సమయంలో క్రీమ్లైన్ డైరీలో చేరడం గౌరవంగా ఉంది. గోద్రెజ్ జెర్సీ బ్రాండ్ ద్వారా క్రీమ్లైన్ సంస్థ వినియోగదారులకు, రైతులకు మేలు చేసే ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించింది. తనతో పాటు ఉన్న సమర్థవంతమైన బృందంతో కలిసి, ఆవిష్కరణలను వేగవంతం చేస్తూ, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తూ, వ్యాపార విస్తరణకు కృషి చేస్తాను. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాడి పరిశ్రమను తీర్చిదిద్దుతూ, వాటాదారులందరికీ దీర్ఘకాలిక విలువను అందించేలా కంపెనీని ముందుకు తీసుకెళ్తాం” అని పేర్కొన్నారు.



