హైదరాబాద్లో వన మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్!
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) తన సీఎస్ఆర్ విభాగమైన 'ఏయూ ఫౌండేషన్' ద్వారా విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన "ఏక్ పేడ్ మా కే నామ్ 3.0" ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) తన సీఎస్ఆర్ విభాగమైన ‘ఏయూ ఫౌండేషన్’ ద్వారా విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన “ఏక్ పేడ్ మా కే నామ్ 3.0” ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. పర్యావరణ సుస్థిరతను పెంపొందించడం మరియు సామాజిక బాధ్యతను చాటిచెప్పడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ఏయూ ఎస్ఎఫ్బీ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫణి శంకర్ నాయకత్వం వహించారు. హైదరాబాద్, ఘట్కేసర్లోని బాసిల్ వుడ్స్ నేచర్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులతో కలిసి ఫణి శంకర్ మొక్కలు నాటారు.
ప్రచార విశేషాలు:
జూలై 1, 2026న ప్రారంభమైన ఈ కార్యక్రమం జులై 31, 2026 వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 580కి పైగా ఏయూ ఎస్ఎఫ్బీ శాఖలు పాఠశాలలు మరియు సామాజిక ప్రదేశాలలో 5,000 కంటే ఎక్కువ మొక్కలను నాటాయి.
ఈ ప్రచారంలో భాగంగా 12 వేలకు పైగా సీడ్-పేపర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫణి శంకర్ మాట్లాడుతూ, పర్యావరణ బాధ్యత చిన్న పనులతోనే మొదలవుతుందని, నేటి విద్యార్థులు నాటే మొక్క రేపటి తరాలకు శాశ్వత వారసత్వంగా మారుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల బ్యాంక్ సంస్థాగత నిబద్ధతను చాటుతూ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నేతృత్వంలో ఆరు రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది.



