ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్: ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ రేట్లను 7.13 శాతానికి పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్!
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను, మార్కెట్ లిక్విడిటీని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan SFB) తమ ఎన్ఆర్ఐ (NRI) సేవల పరిధిని మరింత విస్తరించింది.

భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలను, మార్కెట్ లిక్విడిటీని బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan SFB) తమ ఎన్ఆర్ఐ (NRI) సేవల పరిధిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయుల కోసం గ్లోబల్ డిపాజిట్ ఆఫరింగ్ను పెంచుతూ.. యూఎస్ డాలర్ (USD) ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఏడాదికి గరిష్టంగా 7.13 శాతం కు పెంచింది. విదేశాల్లో నివసించే భారతీయులు తమ సంపాదనను స్వదేశంలో సురక్షితంగా దాచుకోవడానికి మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత పోటీతత్వ రేట్లలో ఇది ఒకటిగా నిలిచింది.
బ్యాంకింగ్ వ్యవస్థలోకి స్థిరమైన విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్బీఐ ఇటీవల తెచ్చిన మార్గదర్శకాలు ఎంతో ప్రణాళికాబద్ధంగా ఉన్నాయి. ఈ నూతన ఫ్రేమ్వర్క్ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడటంతో పాటు ఎన్ఆర్ఐ కస్టమర్లు తమ పొదుపు మొత్తాలపై ఎటువంటి రిస్క్ లేకుండా గరిష్ట రాబడిని పొందేందుకు ఒక నమ్మకమైన మార్గాన్ని అందిస్తుంది. ఉజ్జీవన్ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న ఈ గరిష్ట వడ్డీ రేట్లు 3 నుండి 5 సంవత్సరాల కాలపరిమితి ఉండే యూఎస్డీ డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.
దేశ ప్రగతిలో సరికొత్త భాగస్వామ్యం
ఈ బ్యాంకింగ్ అప్డేట్ గురించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్సీ టీపీపీ హెడ్ హితేంద్ర ఝా మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో దేశ వృద్ధి పథంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావడానికి ఆర్బీఐ నిర్ణయం సరైన సమయంలో వచ్చిన గొప్ప అవకాశమని కొనియాడారు. ఈ చొరవ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి స్థిరమైన విదేశీ కరెన్సీ నిధులు వస్తాయని, ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉజ్జీవన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ఆర్బీఐ దూరదృష్టికి అనుగుణంగా వినూత్నమైన, కస్టమర్-ఫస్ట్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అందించడానికి కట్టుబడి ఉందని, తద్వారా వినియోగదారులకు దీర్ఘకాలిక విలువను చేకూరుస్తూ దేశ ఆర్థిక పురోగతికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హితేంద్ర ఝా స్పష్టం చేశారు. అంతర్జాతీయ పొదుపు పెట్టుబడులకు భారతదేశం అత్యంత అనుకూలమైన వేదికగా మారుతున్న తరుణంలో, ఉజ్జీవన్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రవాస తెలుగువారితో పాటు గ్లోబల్ ఎన్ఆర్ఐ కస్టమర్లను పెద్ద ఎత్తున ఆకర్షించనుంది.



