తెలంగాణసంగారెడ్డి

Sankranthi: ముగ్గుల పోటీల్లో మెరిసిన అతివలు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చింత ప్రభాకర్ విమర్శలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణం 33వ వార్డు మధుర నగర్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి.

సంగారెడ్డి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణం 33వ వార్డు మధుర నగర్‌లో మహిళలకు ముగ్గుల పోటీలు సందడిగా సాగాయి. మాజీ కౌన్సిలర్ మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాత నిధులను రద్దు చేయడమే కాకుండా, కొత్తగా నిధులు మంజూరు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యతని స్పష్టం చేశారు.

విజేతల వివరాలు: ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు.

ప్రథమ బహుమతి: అనూష (రూ. 5,000)

ద్వితీయ బహుమతి: జ్యోతి (రూ. 3,000)

తృతీయ బహుమతి: పద్మ (రూ. 2,000)

స్థానిక సమస్యలపై హామీ..

వార్డులో రోడ్డు వసతులు వంటి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, వార్డు ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *